వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: గంభీర్
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ సొంత పార్టీ నేత కపిల్ మిశ్రాను ఉద్దేశించి అన్నారు. ‘‘ఇక్కడ వ్యక్తులు ఎవరనేది ముఖ్యం కాదు. కపిల్ మిశ్రా లేదా....
దిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ సొంత పార్టీ నేత కపిల్ మిశ్రాను ఉద్దేశించి అన్నారు. ‘‘ఇక్కడ వ్యక్తులు ఎవరనేది ముఖ్యం కాదు. కపిల్ మిశ్రా లేదా ఇతర పార్టీల వ్యక్తులు ఎవరైనా కావచ్చు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులే సురక్షితంగా లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒక్క సారి ఊహించుకోండి’’ అని అన్నారు. ఆదివారం దిల్లీలోని జాఫ్రాబాద్లో సమావేశమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మద్దతుదారులను ఉద్దేశించి భాజపా నేత కపిల్ మిశ్రా ప్రసంగించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఏఏకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా దిల్లీ పోలీసులు మూడు రోజుల్లోగా నిరసకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని అల్టిమేటం విధించారు.
దీంతో ఆయన వ్యాఖ్యలపై ఆ ప్రాంతంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దానికి కొనసాగింపుగా సోమవారం సీఏఏ వ్యతిరేక, మద్దతు దారుల మధ్య వాగ్వాదం కాస్తా చోటుచేసుకొంది. అది కాస్తా ఉద్రిక్తంగా మారి ఘర్షణలకు దారి తీసింది. అయితే కపిల్ మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే హింస చెలరేగిందని పలు సంఘాలు ఆరోపించిన నేపథ్యంలో గంభీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఘర్షణల్లో పోలీస్ కానిస్టేబుల్తో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఇతర పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరో పక్క దిల్లీ ప్రజలు సంయమనం పాటించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయమెందుకు?
ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
నామినేషన్లకు వేళాయె..
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
అడ్డంకులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్రాజ్ ఆదేశించారు. -
కాంగ్రెస్లో వలసల ప్రభావమెంత?
కాంగ్రెస్లోకి కొనసాగుతున్న భారీ వలసలు లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. -
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!