‘నేనేం ఎర్రబస్సు ఎక్కిరాలేదు’

జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సత్యవతి రాఠోడ్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే రాకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని.....

Published : 27 Feb 2020 00:48 IST

మంత్రి సత్యవతి రాఠోడ్‌తో ఎమ్మెల్యే వాగ్వాదం

మహబూబాబాద్‌: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సత్యవతి రాఠోడ్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మధ్య వాగ్వాదం జరిగింది.  స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తాను రాకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని శంకర్‌నాయక్‌ ప్రశ్నించారు. తాను ఆర్‌ఈసీలో చదువుకున్నానని.. ఎర్రబస్సు ఎక్కి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. సమీక్ష సమావేశాలు కేవలం ఫొటోలు దిగడానికి పరమితమవుతున్నాయంటూఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటనేది తమకు తెలుస్తాయని.. ఆ సమస్యలను మంత్రి, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయన్నారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే రాకుండా సమీక్ష ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ కలుగజేసుకుని సమాచార లోపంతో జరిగిందంటూ క్షమాపణ చెప్పినా శంకర్‌నాయక్‌ వినిపించుకోలేదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని