‘రూ.500 ఇస్తాం.. గుడ్లు, టమాటాలు విసరాలి’

చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి తీసుకొచ్చారని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నాయకులు తీసుకొచ్చిన పెయిడ్‌ ఆర్టిస్టులు చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటాలతో

Updated : 27 Feb 2020 14:42 IST

అలా వైకాపా పెయిడ్‌ ఆర్టిస్టులు దాడి చేశారన్న వర్ల

విశాఖ: చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి తీసుకొచ్చారని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నాయకులు తీసుకొచ్చిన పెయిడ్‌ ఆర్టిస్టులు చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు కాన్వాయ్‌పై దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. భవిష్యత్తును తలచుకుంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 
‘‘ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సినిమాకు జగన్‌ ట్రైలర్‌ మాత్రమే ఇవాళ చూశారు. విశాఖలో జగన్‌ పాలన ప్రారంభమైతే ఆ సినిమా ఇంకెలా ఉంటుందో గ్రహించాలి. చంద్రబాబు పర్యటనను 10 రోజుల ముందే ప్రకటిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అడ్డుకుంటామని మంత్రులే ప్రకటిస్తే వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. ప్రశాంతంగా ఉండే విశాఖకు పులివెందుల సంప్రదాయం తీసుకుకొస్తున్నారు’’ అని వర్ల రామయ్య విమర్శించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పసుపు చీరలు కట్టుకున్న వైకాపా కార్యకర్తల వీడియోలను వర్ల రామయ్య విడుదల చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు