‘అమిత్షా జీ.. నేనొక ఎంపీనని చెప్పండి’
ఈశాన్య దిల్లీలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శిరోమణి అకాళీదళ్ ఎంపీ నరేశ్ గుజ్రాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి, దిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్.........
దిల్లీ పోలీసుల తీరుపై అకాళీదళ్ ఎంపీ ఆగ్రహం
దిల్లీ: ఈశాన్య దిల్లీలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శిరోమణి అకాళీదళ్ ఎంపీ నరేశ్ గుజ్రాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి, దిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్కు లేఖ రాశారు. ఘర్షణల సమయంలో ఫిర్యాదులు చేసినా పోలీసులు ఉదాసీనతతో వ్యవహరించారని లేఖలో ఆరోపించారు. భాజపా మిత్రపక్షానికి చెందిన గుజ్రాల్.. అల్లర్లు జరిగిన మౌజ్పూర్ ప్రాంతంలో ఓ ఇంట్లో చిక్కుకుపోయిన 16 మందిని కాపాడాలని బుధవారం రాత్రి 11.43 గంటల సమయంలో పోలీసులను కోరానని చెప్పారు. అల్లరిమూక ఆ ఇంటిపై దాడిచేస్తున్న సమయంలో వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. తన ఫిర్యాదు పోలీసులకు అందినా వారు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఓ ఎంపీనని వాళ్లకు చెప్పండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆ ఇంటి పొరుగున ఉన్న వారు వచ్చి కాపాడటం వల్లే ఆ 16 మంది ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని తెలిపారు. ఒక ఎంపీ వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసినప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. పోలీసుల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగడం ఆశ్చర్యమేమీ కాదని ఆయన మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్