పోలవరంపై మీవి అబద్ధాలని ఒప్పుకుంటారా?
రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకాలాడి పోలవరం పనులు నిలిపేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లను...
దేవినేని
మంగళగిరి: రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకాలాడి పోలవరం పనులు నిలిపేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయడం లేదని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 6.15 లక్షల ఇళ్లు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయని చెప్పారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని, ఇంటి స్థలాల పేరుతో బడుగువర్గాలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు.
గతంలో సంక్రాంతికి ఇసుక లేకుండా చేసి పేదలను ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు ఉగాదికి భూములను లాక్కొని పేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని దేవినేని మండిపడ్డారు. పోలవరంలో పునాదులు పూర్తి కాలేదని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకాలు ఆడి పనులు నిలిపేశారని విమర్శించారు. పోలవరంపై గత ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు బయటపెట్టడం లేదని, ఈ ప్రాజెక్టుపై మీరు చెప్పినవన్నీ అబద్ధాలని ఒప్పుకుంటారా? అని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం