పోలవరంపై మీవి అబద్ధాలని ఒప్పుకుంటారా?

రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నాటకాలాడి పోలవరం పనులు నిలిపేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లను...

Published : 01 Mar 2020 01:01 IST

దేవినేని

మంగళగిరి: రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నాటకాలాడి పోలవరం పనులు నిలిపేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయడం లేదని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 6.15 లక్షల ఇళ్లు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయని చెప్పారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని, ఇంటి స్థలాల పేరుతో బడుగువర్గాలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు.

గతంలో సంక్రాంతికి ఇసుక లేకుండా చేసి పేదలను ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు ఉగాదికి భూములను లాక్కొని పేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని దేవినేని మండిపడ్డారు. పోలవరంలో పునాదులు పూర్తి కాలేదని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌.. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నాటకాలు ఆడి పనులు నిలిపేశారని విమర్శించారు. పోలవరంపై గత ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు బయటపెట్టడం లేదని, ఈ ప్రాజెక్టుపై మీరు చెప్పినవన్నీ అబద్ధాలని ఒప్పుకుంటారా? అని నిలదీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు