సీఏఏపై మతం రంగు పులుముతున్నారు:లక్ష్మణ్‌

భాజపా ప్రత్యర్థులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆ పార్టీ

Updated : 01 Mar 2020 18:07 IST

హైదరాబాద్‌: భాజపా ప్రత్యర్థులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీకి పెరుగుతున్న ఆదరణ చూడలేకే సీఏఏపై మతం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో సీఏఏపై న్యాయవాదులు, వైద్యులతో నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. ఎన్‌ఆర్‌సీ అంశంపై కొందరు ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. దేశాన్ని అస్తిరపరిచేందుకు కొన్ని అదృశ్య శక్తులు దిల్లీలో అల్లర్లు సృష్టించాయని మండిపడ్డారు. భారత్‌లో ముస్లింలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని.. 52 ముస్లిం దేశాల్లో లేని స్వేచ్ఛ భారతీయ ముస్లింలకు ఉందని గుర్తు చేశారు. శరణార్థులకు పౌరసత్వం ఇస్తామంటే ఆందోళన చేయడం సరికాదని లక్ష్మణ్‌ హితవు పలికారు. సీఏఏకు అనుకూలంగా భాజపా ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వహించనున్న సభకు అందరూ హాజరుకావాలని లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని