నిషేధానికి ఇది ముందస్తు సంకేతమా? : థరూర్
ప్రధాని మోదీ వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాను వీడే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సామాజిక మీడియాను వీడొద్దంటూ విజ్ఞప్తులు.....
దిల్లీ: ప్రధాని మోదీ వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాను వీడే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాలను వీడొద్దంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ప్రధాని సామాజిక మాధ్యమాలను వీడటంపై ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు చేపడుతున్న ముందస్తు చర్యగా ప్రధాని నిర్ణయాన్ని అభివర్ణించారు. ‘‘ప్రధాని ఆకస్మిక నిర్ణయం దేశవ్యాప్తంగా ఆందోళనను రేకేత్తిస్తోంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు ముందస్తు చర్యగా దీన్ని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు మంచితో పాటు ఉపయోగకరమైన సందేశాలను పంచుకొనేందుకు ఒక వేదికగా ఉంటాయని ప్రధానికి కూడా తెలుసు. ఇది ద్వేషాన్ని వ్యాపింపచేయడం గురించి కాదు’’ అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురీ కూడా ప్రధాని సామాజిక మాధ్యమాలను వీడటం అనేది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న పనిగా ఆరోపించారు. రాజకీయ విమర్శకుడు, వాజ్పేయి మాజీ సహాయకుడు సుధీంద్ర కులకర్ణి కూడా ప్రధాని ట్వీట్పై స్పందించారు. ‘‘భారత ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, కమ్యూనికేషన్పై అతి పెద్ద దాడి. త్వరలో ప్రజాస్వామ్యంపై కూడా ఇటువంటివి జరగొచ్చు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం’’ అని ట్వీట్ చేశారు. అయితే ప్రధానిని ట్విటర్లో 5.33 కోట్లు, ఫేస్బుక్లో 4.4 కోట్లు, ఇన్స్టాగ్రాంలో 3.52 కోట్ల మంది అనుసరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?