లోకేశ్‌ పర్యటన అడ్డుకునేందుకు వైకాపా యత్నం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ప్రజా చైతన్యయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించాయి. మునికూడలి గ్రామం వద్దకు...

Published : 04 Mar 2020 01:22 IST

ఇరువర్గాల మధ్య ఘర్షణ

సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ప్రజా చైతన్యయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించాయి. మునికూడలి వద్దకు కాన్వాయ్‌ రాగానే ‘లోకేశ్‌ గో బ్యాక్‌’ అంటూ వైకాపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీలో అత్యధికంగా పాల్గొన్న తెదేపా వర్గీయులు వైకాపా శ్రేణులను ప్రతిఘటించారు. ర్యాలీ పూర్తి చేసి వెళ్లిపోతున్న సమయంలో వైకాపా అడ్డంకులు సృష్టించడం తగదని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని