ఏడుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
దిల్లీ: లోక్సభలో గురువారం ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓంబిర్లా నిర్ణయం తీసుకున్నారు. సభలో అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న
దిల్లీ: లోక్సభలో గురువారం ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు. సభలో అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా వీరిని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తునట్టు వాయిస్ ఓట్ ద్వారా తీర్మానం చేశారు. సస్పెండ్ గురైన ఎంపీలలో గౌరవ్గొగొయ్, ఇబే హిందోన్, రాజ్ మోహన్ ఉన్నిధాన్, గుర్జిత్ సింగ్ అజ్లా, టీఎన్ ప్రతాపన్, దీన్ కురియకోస్, మాణిక్య ఠాగూర్లు ఉన్నారు. రెండురోజుల క్రితం మార్చి11న దిల్లీ అల్లర్లపై చర్చ జరుపుతామని స్పీకర్ ప్రకటించిన నేపధ్యంలో ఈ రోజే చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హౌస్లో పేపర్లను చింపి స్పీకర్ స్థానం వైపునకు ఉద్దేశపూర్వకంగా వేశారన్న కారణంగా వీరిని సస్పెండ్ చేసినట్టు స్పీకర్ తెలిపారు. ఈ పరిణామంపై కాంగ్రెస్పార్టీ లోక్సభ లీడర్ అధిర్రంజన్ చౌథరీ స్పందిస్తూ..ఇది స్పీకర్ తీసుకున్న నిర్ణయం కాదని ప్రభుత్వం కక్షపూరితధోరణితో తీసుకున్న నిర్ణయమంటూ మండిపడ్డారు. ఈ సస్పెన్షన్ తాము ఒప్పుకోబోమన్నారు. పార్లమెంటు లోపల, బయట ప్రభుత్వధోరణికి వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. కాగా సోమవారం ప్రారంభమైన ఈ రెండోవిడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 3న ముగియనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!