న్యాయపోరాటం చేస్తా: అశోక్గజపతిరాజు
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదని కేంద్ర మాజీ మత్రి, తెదేపా సీనియర్ నేత అశోక్గజపతిరాజు అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...దాతలు ఇచ్చిన భూములు ఆలయానికే చెందాలని స్పష్టం
విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదని కేంద్ర మాజీ మత్రి, తెదేపా సీనియర్ నేత అశోక్గజపతిరాజు అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...సింహాచలం దేవస్థానం పరిధిలో 105 ఆలయాలు, విలువైన భూములు ఉన్నాయని, దేవస్థానం భూములపై కొందరు కన్నేశారని ఆరోపించారు. దాతలు ఇచ్చిన భూములు ఆలయానికే చెందాలని స్పష్టం చేశారు. ట్రస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయన్నారు. పిల్లలకు భవిష్యత్ను ఇవ్వడానికే ట్రస్ట్ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సంచైత ఆధార్కార్డు పరిశీలిస్తే ఆమె ఎక్కడ నివసిస్తున్నారో అందరికీ తెలుస్తుందన్నారు.
ప్రభుత్వ తీరుతో భవిష్యత్ తరాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రస్టు విషయంలో ప్రభుత్వం తీరు వింతగా ఉందన్నారు. ప్రభుత్వ తీరుతో పరిశ్రమలు, పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. నోటీసులు ఇవ్వకుండానే నిర్ణయం తీసుకున్నారు.. రాత్రికి రాత్రే దొంగతనంగా జీవో ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటి వరకు జీవోను బయటపెట్టలేదని, రహస్యంగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అందరి సహకారంతో ప్రభుత్వ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని అశోక్గజపతిరాజు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు