న్యాయపోరాటం చేస్తా: అశోక్‌గజపతిరాజు

మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదని కేంద్ర మాజీ మత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...దాతలు ఇచ్చిన భూములు ఆలయానికే చెందాలని స్పష్టం

Updated : 07 Mar 2020 14:15 IST

విజయనగరం: మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదని కేంద్ర మాజీ మత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...సింహాచలం దేవస్థానం పరిధిలో 105 ఆలయాలు, విలువైన భూములు ఉన్నాయని, దేవస్థానం భూములపై కొందరు కన్నేశారని ఆరోపించారు. దాతలు ఇచ్చిన భూములు ఆలయానికే చెందాలని స్పష్టం చేశారు. ట్రస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని, ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయన్నారు. పిల్లలకు భవిష్యత్‌ను ఇవ్వడానికే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సంచైత ఆధార్‌కార్డు పరిశీలిస్తే ఆమె ఎక్కడ నివసిస్తున్నారో అందరికీ తెలుస్తుందన్నారు.

ప్రభుత్వ తీరుతో భవిష్యత్‌ తరాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రస్టు విషయంలో ప్రభుత్వం తీరు వింతగా ఉందన్నారు. ప్రభుత్వ తీరుతో పరిశ్రమలు, పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. నోటీసులు ఇవ్వకుండానే నిర్ణయం తీసుకున్నారు.. రాత్రికి రాత్రే దొంగతనంగా జీవో ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటి వరకు జీవోను బయటపెట్టలేదని, రహస్యంగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అందరి సహకారంతో ప్రభుత్వ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని