మధ్యప్రదేశ్: వెనక్కి వచ్చిన మరో ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్లో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆదివారం మరొకరు వెనక్కి వచ్చారు. ఎమ్మెల్యే బిసాహులాల్ సింగ్ బెంగళూరు నుంచి భోపాల్కు విమానంలో వచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా తెలిపారు.
భోపాల్: మధ్యప్రదేశ్లో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆదివారం మరొకరు వెనక్కి వచ్చారు. ఎమ్మెల్యే బిసాహులాల్ సింగ్ బెంగళూరు నుంచి భోపాల్కు విమానంలో వచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా తెలిపారు. బిసాహులాల్ వెంట పర్యాటక మంత్రి సురేంద్ర బగేల్ ఉన్నట్లు చెప్పారు. భోపాల్లో దిగిన వెంటనే వారు నేరుగా సీఎం కమల్నాథ్ నివాసానికి వెళ్లారు. మిస్సింగ్ అయిన ఎమ్మెల్యేల రాకతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా చేసిన ప్రయత్నం విఫలమైందని హోంమంత్రి బాల బచ్చన్ అన్నారు. నిన్న వెనక్కి వచ్చిన స్వతంత్ర ఎమ్మెల్యే సైతం తాను కాంగ్రెస్ వైపునే ఉన్నట్లు ప్రకటించారు.
మధ్యప్రదేశ్లో ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడం రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదట వారిలో ఆరుగురు వెనక్కి వచ్చారు. ఆ తర్వాత మిగిలిన నలుగురిలోనూ మళ్లీ ఇద్దరు వెనక్కి వచ్చారు. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు రావాల్సి ఉంది. మధ్యప్రదేశ్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్కు 114 మంది అభ్యర్థుల బలమే కాకుండా.. ఎస్పీ, బీఎస్పీ, స్వతంత్రులు ఏడుగురు సభ్యుల మద్దతు ఉంది. భాజపాకు 107 మంది అభ్యర్థుల బలం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే