ఆ తీర్మానానికి కాంగ్రెస్‌ పూర్తి మద్దతు: ఉత్తమ్‌

రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ, సీఎఎలకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లయితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.....

Published : 09 Mar 2020 02:08 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ, సీఎఎలకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లయితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఎన్‌పీఆర్‌కు సంబంధించిన కార్యకలాపాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని, అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు. మతపరమైన ఎజెండాతో కేంద్రం తీసుకొచ్చిన వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 20న ఇచ్చిన జీవో కాపీని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖకు ఉత్తమ్‌ జత చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని