మాంద్యంలోనూ బ్రహ్మాండమైన బడ్జెట్‌:మంత్రులు

రాష్ట్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌, భాజపా నేతలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రులు అన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌..

Updated : 09 Mar 2020 14:29 IST

హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌, భాజపా నేతలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రులు అన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, గంగుల కమలాకర్‌ మాట్లాడారు. ఆర్థిక మాంద్యంలోనూ బ్రహ్మాండమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టామని.. సీఎం కేసీఆర్‌ ఆరునెలల కసరత్తు ఫలితంగా ఇంత మంచి బడ్జెట్‌ రూపొందించగలిగామని చెప్పారు. ఆర్థిక రంగ మేధావులు బడ్జెట్‌ను స్వాగతించారన్నారు.

బీసీలకు పెద్ద పీట వేశామని.. అన్ని వర్గాలకు కేటాయింపులు పెరిగాయని తలసాని అన్నారు. 70 ఏళ్ల తర్వాత బీసీలకు తెలంగాణలో న్యాయం జరుగుతోందని చెప్పారు. అందరూ జ్యోతిరావు పూలే పేరు చెప్పుకున్నారని..కానీ ఆయన ఆశయాలను నిజంగా అమలు చేస్తోంది తెరాస సర్కారేనన్నారు. హైదరాబాద్‌లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తలసాని ప్రకటించారు. శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ అద్భుతమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్‌, భాజపాలు బిత్తరపోయి మాట్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలోనూ బీసీలకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదని.. బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని మరో మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని