20మంది ఎమ్మెల్యేల రాజీనామా
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్కు రాజీనామా చేయడం.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 15 నెలల కమల్నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్కు రాజీనామా చేయడం.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 15 నెలల కమల్నాథ్ సర్కార్కు బీటలు వారి కుప్పకూలే స్థితికి దిగజారింది. సింధియా పార్టీని వీడిన కాసేపటికే ఆయన వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఈ ఎమ్మెల్యేలంతా తమ రాజీనామా పత్రాలను ఈమెయిల్ ద్వారా గవర్నర్కు పంపినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు.
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ప్రస్తుతం హోలీ వేడుకల నిమిత్తం లఖ్నవూ వెళ్లారు. తాజా పరిణామాల గురించి తెలియగానే ఆయన తన పర్యటనను కుదించుకుని తిరిగి భోపాల్ బయల్దేరారు. గవర్నర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
230 శాసనసభ స్థానాలు గల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 114, భాజపాకు 107 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ శాసనసభ్యులు, సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒకరు కమల్నాథ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో మొత్తం సభ్యుల సంఖ్య 228గా ఉంది. తాజాగా 20 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే అసెంబ్లీ బలం 208కు తగ్గుతుంది. కమల్నాథ్ సర్కార్ గట్టెక్కాలంటే 105 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
6 గంటలకు భాజపాలోకి సింధియా..
మరోవైపు కాంగ్రెస్కు రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా మరికొద్ది గంటల్లో భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం 6 గంటలకు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే సింధియా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. ప్రధానితో భేటీ అనంతరం సింధియా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇవీ చదవండి..
సింధియాను బహిష్కరించిన కాంగ్రెస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు