సింధియా విషయంలో మాతప్పు అదే: దిగ్విజయ్
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 22 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 13 మంది తాము కాంగ్రెస్ను వీడడం లేదని హామీ ఇచ్చారని తెలిపారు........
దిల్లీ: మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 22 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 13 మంది తాము కాంగ్రెస్ను వీడడం లేదని హామీ ఇచ్చారని తెలిపారు. సింధియాను రాజ్యసభకు ఎంపిక చేసేలా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే వారంతా బెంగళూరు వెళ్లారన్నారు. భాజపాలో చేరే ఉద్దేశం వారికి ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కమల్నాథ్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో కచ్చితంగా నెగ్గి తీరతామన్నారు. సింధియాకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశామని తెలిపారు. కానీ, ఆయన మాత్రం తాను ఎంపిక చేసిన అభ్యర్థికి ఇవ్వాలని కోరారని చెప్పుకొచ్చారు. దీనికి కమల్నాథ్ అంగీకరించలేదని వెల్లడించారు. సింధియాను కాంగ్రెస్ కేవలం రాజ్యసభకు మాత్రమే పంపగలిగేదని.. కానీ, ‘మోదీ-షా’ అయితే కేంద్రమంత్రి పదవి కూడా ఇవ్వగలుగుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేసిన శివరాజ్సింగ్ చివరకు సింధియాను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు భారీగా డబ్బులు ఇవ్వజూపారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సింధియా పార్టీని వీడతారని ఊహించలేదని.. అదే కాంగ్రెస్ చేసిన తప్పిదమని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్