కమలం గూటికి సింధియా
తీవ్ర ఉత్కంఠ పరిణామల మధ్య కాంగ్రెస్ను మంగళవారం వీడిన ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ.........
దిల్లీ: తీవ్ర ఉత్కంఠ పరిణామల మధ్య మంగళవారం కాంగ్రెస్ను వీడిన ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కమలం గూటికి చేరారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బుధవారం ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. తొలుత ఈ రోజు 12.30 గంటలకే భాజపాలో చేరుతారని వార్తలొచ్చినా చివరకు ఆయన ఈ మధ్యాహ్నం 2.30గంటల తర్వాత భాజపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత భాజపా నేతలతో కాసేపు చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సింధియాకు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ప్రాథమిక సభ్యత్వ రసీదును అందజేశారు. 18 ఏళ్ల పాటు కాంగ్రెస్లో పనిచేసిన సింధియా ఆ పార్టీకి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్లో తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరలేచిన విషయం తెలిసిందే. సింధియాకు భాజపా రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర కేబినెట్లోకి తీసుకొనే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.
సింధియా భాజపాలో బుధవారం చేరతారన్న సమాచారంతో ఆయన నివాసం వద్దకు మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరుతున్న నేపథ్యంలో అభిమానులు ఆయనతో పాటు మోదీ, అమిత్ షా ఫొటోలతో దిల్లీలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరోవైపు, భోపాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సింధియా గది వద్ద ఆయన నామ ఫలకాన్ని అక్కడి సిబ్బంది మంగళవారమే తొలగించారు.
మంగళవారం ఉదయం దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సింధియా భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం వారిద్దరూ కలిసి ప్రధాని నరేంద్ర మోదీతోనూ సమావేశమై చర్చించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై బహిష్కరణ వేటు వేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు సింధియా విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో అక్కడి సర్కార్ తీవ్ర సంక్షోభంలో పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.