కాంగ్రెస్తో ఉంటే ప్రజాసేవ చేయలేను: సింధియా
పద్దెనిమిదేళ్ల పాటు సుదీర్ఘంగా కాంగ్రెస్తో కలిసి పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. ఎన్నో ఉత్కంఠ పరిణామాల అనంతరం బుధవారం మధ్యాహ్నం భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ
దిల్లీ: పద్దెనిమిదేళ్ల పాటు సుదీర్ఘంగా కాంగ్రెస్తో కలిసి పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. ఎన్నో ఉత్కంఠ పరిణామాల అనంతరం బుధవారం మధ్యాహ్నం భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ఒకప్పటి పార్టీలా లేదని, ఇంకా అక్కడే కొనసాగితే ప్రజాసేవ చేయలేననే ఉద్దేశంతోనే తాను పార్టీ మారానని సింధియా తెలిపారు.
భాజపాలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు నేను జేపీ నడ్డా, ధరేంద్రప్రదాన్ లాంటి వ్యక్తులతో వేదిక పంచుకున్నాను. నన్ను తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. నా జీవితంలో రెండు తేదీలు ఎప్పటికీ మర్చిపోను. ఒకటి.. 2001 సెప్టెంబరు 30న మా నాన్న(మాధవ్రావ్ సింధియా)ను కోల్పోయా. మా నాన్న మరణం నా జీవిత స్వరూపాన్ని మార్చేసింది. ఇక రెండోది.. 2020 మార్చి 10న నా జీవితంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నా. అది కూడా మా నాన్న జయంతి రోజున తీసుకోవడం ఆనందంగా ఉంది’ అని సింధియా చెప్పుకొచ్చారు.
తన లక్ష్యం ప్రజాసేవే అని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్తో ఉంటే ఆ లక్ష్యాన్ని చేరుకోలేనని బలంగా చెప్పగలనని సింధియా అన్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రజాసేవ చేసే అవకాశం లేక తాను ఎంతో వేదనకు గురయ్యాయని తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం తాను కన్న కలలన్నీ గత 18 నెలల్లో ఆవిరయ్యాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, రైతులను ఆదుకోలేకపోయిందని కమల్నాథ్ సర్కార్ను దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఒకప్పటి పార్టీగా లేదని, ఇప్పుడు చాలా మారిపోయిందని విమర్శించారు. పార్టీలో అవినీతి, మాఫియా పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ కారణాల వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ సందర్భంగా భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై సింధియా ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల్లో దేశం పూర్తి భద్రంగా ఉందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా ద్వారా మళ్లీ ప్రజలకు సేవే చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సింధియా ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్