బల పరీక్షకు రెడీ: మా ఎమ్మెల్యేల్ని బంధించారు
మధ్యప్రదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో బల పరీక్షకు సిద్ధమేననీ.. అయితే, తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్ని భాజపా బందించిందని ముఖ్యమంత్రి కమల్నాథ్ .......
గవర్నర్ను కలిసిన కమల్నాథ్
దిల్లీ: మధ్యప్రదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో బల పరీక్షకు సిద్ధమేననీ.. అయితే, తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్ని భాజపా నిర్బంధించిందని ముఖ్యమంత్రి కమల్నాథ్ ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆయన రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్తో భేటీ అయ్యారు. గురువారం రాత్రి లఖ్నవూ నుంచి భోపాల్కు చేరుకున్న గవర్నర్ను సీఎం కలిసి రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం గురించి వివరించారు. ఈ సందర్భంగా మూడు పేజీల లేఖను గవర్నర్కు అందజేశారు. మధ్యప్రదేశ్లో భాజపా వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా గతం నుంచి ప్రయత్నాలు చేస్తోందనీ.. అనైతికంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని లేఖలో మండిపడ్డారు. కొందరు మంత్రులతో పాటు కాంగ్రెస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలను భాజపా బంధించిందని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులతో ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని, గవర్నర్ కార్యాలయం జోక్యం చేసుకొని నిర్బంధంలో ఉన్న తమ ఎమ్మెల్యేలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. మరోవైపు, తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలను భాజపా బెంగళూరులోని ఓ రిసార్ట్లో ఉంచిందంటూ గతం నుంచి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండగా.. భాజపా నేతలు తిప్పికొడుతున్నారు. మరోవైపు సింధియాకు మద్దతుగా రాజీనామా చేసిన మంత్రులతో సంప్రదింపులు జరిపేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఈ నెల 16 నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
2018 ఎన్నికల్లో సీఎం పదవి ఇస్తారని ఆశించి భంగపాటుకు గురైన జ్యోతిరాదిత్య సింధియాకు ఆ తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి, రాజ్యసభ సీటు సైతం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కాంగ్రెస్కు గుడ్ బై చెప్పడంతో మధ్యప్రదేశ్లో తీవ్ర రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. మంగళవారం కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సింధియా ఆ మరుసటి రోజే భాజపాలో చేరి రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు. బొటాబొటీ మెజార్టీతోనే నెట్టుకొస్తున్న కమల్నాథ్ సర్కార్కు 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమైంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తనను ఈ రోజు లోపు కలవాలని స్పీకర్ పి. ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలిదశకు ముగిసిన ప్రచారం
సార్వత్రిక సమరం అసలుసిసలు ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతలకు విస్తరించిన ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. -
రాష్ట్ర అంశాలే ఎజెండా
రాజస్థాన్లో భాజపా హవాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. క్లీన్స్వీప్ చేయకుండా కొన్ని సీట్లైనా దక్కించుకోవాలని పోరాడుతోంది. -
గ్యారంటీగా వచ్చేది మేమే
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గ్యారంటీగా అధికారంలోకి వచ్చేది తామేనని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అస్సాంలోని నలబాడీలో, త్రిపుర రాజధాని అగర్తలలో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. -
ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్
దేశంలో ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. -
సంక్షిప్త వార్తలు
దేశంలోని అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తామని సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం వెనకున్న ఉద్దేశమేమిటి? -
తొలి విడతలో కీలకం!
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో కొన్ని నియోజకవర్గాలు పార్టీలకు, నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. -
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాంనబీ ఆజాద్.. అనంత్నాగ్-రాజౌరి సీటు నుంచి పోటీ చేయట్లేదని ఆ పార్టీ ప్రకటించింది. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ
లోక్సభ ఎన్నికల తొలి విడత బరిలో ఉన్న ఎన్డీయే అభ్యర్థులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడివిడిగా లేఖలు రాశారు. -
పేదలకు ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు
కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా 10 గ్యాస్ సిలిండర్లు, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. -
ఐదేళ్లలో ఏం జరిగిందో అవలోకనం చేసుకొని ఓటేద్దాం
ఓటుహక్కు ఉన్న అందరం ఎన్నికల ప్రక్రియలో పాల్గొందామని, ఓటు వేసే ముందు దేశంలో ఐదేళ్లలో ఏం జరిగిందో అవలోకనం చేసుకుని సరైన అభ్యర్థికి, పార్టీకి ఓటు వేద్దామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారం అన్నారు. -
బీఎస్పీలోకి మందా జగన్నాథం
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మందా జగన్నాథం బుధవారం బీఎస్పీ అధినాయకురాలు మాయావతి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
గురుకులాలపై సీఎం వివక్ష: భారాస
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై వివక్ష చూపుతున్నారని భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ విమర్శించారు. -
రాష్ట్రంలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయం: కె.లక్ష్మణ్
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్దే లిల్లీపుట్ మనస్తత్వం: మల్లు రవి
అప్పుడప్పుడు లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. -
పార్లమెంటు నియోజకవర్గాలకు కిసాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జుల నియామకం
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్రంలో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి మినహా మిగతా 14 పార్లమెంటు నియోజకవర్గాలకు జోనల్, నియోజకవర్గ ఇన్ఛార్జులను నియమించింది. -
19, 24 తేదీల్లో ఉమ్మడి వరంగల్లో సీఎం ఎన్నికల ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19, 24 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. -
ప్రభుత్వాన్ని టచ్ చేస్తే.. తెలంగాణభవన్ పునాదులు లేకుండా చేస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే భావనతో.. పార్టీని టచ్ చేయాలని చూస్తే హైదరాబాద్లో భారాస కార్యాలయం తెలంగాణభవన్ పునాదులు లేకుండా చేస్తామని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. -
ప్రజలకు తాగునీరైనా ఇవ్వండి
పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లయినా ఇవ్వాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయమెందుకు?
ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!