వైకాపా దౌర్జన్యాలపై అమిత్షాకు ఫిర్యాదు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాష్ట్ర భాజపా ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ ఆయన్ను కలిసి ఫిర్యాదు లేఖను...
దిల్లీ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాష్ట్ర భాజపా ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ ఆయన్ను కలిసి ఫిర్యాదు లేఖను అందజేశారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను వైకాపా నేతలు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అమిత్షాతో భేటీ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. అధికారులు వైకాపాకు సహకరిస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. పోలీసులు కూడా వైకాపాకు మద్దతుగా మాట్లాడుతూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు.
ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భాజపా నేతలు నామినేషన్ వేసే చోట పోలీసులు అడ్డుకోవడంతో పాటు దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే కేంద్రహోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని సీఎం రమేశ్ చెప్పారు. ఏపీ ప్రజలు సంతోషాన్ని మరిచిపోయి చాలా రోజులైందని మరో ఎంపీ టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం చేస్తు్న్న తప్పులకు కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉందన్నారు. భాజపా, జనసేన నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా దాడులు చేసి ఏం సాధించాలనుకుంటున్నారని వైకాపాను ఆయన ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!