ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు: బుగ్గన
రాష్ట్రానికి అవసరమైన ఆర్థికసాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. దిల్లీలో నిర్మలాసీతారామన్తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలకు...
దిల్లీ: రాష్ట్రానికి అవసరమైన ఆర్థికసాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. దిల్లీలో నిర్మలాసీతారామన్తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలకు సుమారు రూ.5వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని.. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. కేంద్రం నుంచి గ్రాంటు రాకపోవడంతో రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే విధంగా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.3వేల కోట్లు రీయింబర్స్ కావాల్సి ఉందని.. ఆ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను కోరినట్లు బుగ్గన వివరించారు. మరోవైపు జిల్లాల్లో వాటర్గ్రిడ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరామని తెలిపారు. వ్యవసాయం, నీటిపారుదల, తాగునీరు అంశాలపై నీతిఆయోగ్ నిపుణులతో చర్చించామన్నారు. ఆర్థికమాంద్యం ప్రభావం రాష్ట్రంపైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించడానికి మరో మూడేళ్లు పడుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల చిన్న ఘర్షణలు సహజమని ఆయన వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి