నియంతలను కాపాడేందుకే పోలీసు టెర్రరిజం
రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం కొనసాగుతోందని.. పోలీసులే ఇలాంటి టెర్రరిజాన్ని సృష్టి్స్తే ఆ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని తెదేపా అధినేత
వదిలేస్తే ఉగ్రవాదులకన్నా ఘోరంగా తయారవుతారు
రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
మంగళగిరి: రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం కొనసాగుతోందని.. పోలీసులే ఇలాంటి టెర్రరిజాన్ని సృష్టిస్తే ఆ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బైండోవర్ కేసుల పేరుతో పోలీసులే బెదిరింపులకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. పోలీసులే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. నియంతలను కాపాడేందుకే పోలీసు టెర్రరిజం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఇలాగే ప్రవర్తిస్తే పోలీసు వ్యవస్థపై తిరుగుబాటు వస్తుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికల నామినేషన్లను అన్ని విధాలుగా అడ్డుకున్నారని మండిపడ్డారు. వైకాపా దాడులకు సంబంధించిన కొన్ని వీడియాలను చంద్రబాబు మీడియాకు ప్రదర్శించారు. ఒక పక్క శారీరకంగా దాడులు చేస్తూ, మరోవైపు ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తోందంటూ వైకాపాపై మండిపడ్డారు. ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించారని.. చట్ట ప్రకారం పనిచేయాలంటే వీలుకాని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్వీర్యమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైకాపా చేస్తోన్న అరాచకాలు ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అని నిలదీశారు. రాష్ట్ర డీజీపీ కోర్టుకు వెళ్లి సెక్షన్ చదివిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు.
‘తెనాలిలో తెదేపా నేత ఇంట్లోకి రాత్రి పూట అక్రమంగా చొరబడి మద్యం సీసాలు పెట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు లేకుంటే పరిస్థితి ఏంటి? రాజగుంట ఎంపీటీసీ అభ్యర్థిని రాత్రి వెళ్లి బెదిరించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే కొందరి ఇంటికి వెళ్లి బెదిరించడమే కాకుండా దాడులకు పాల్పడ్డారు. మాచర్లలో మా పార్టీ నేతలపై నడిరోడ్డుపైనే దాడులకు దిగారు. విశాఖలో నన్ను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించాను. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన నన్నే నిలువరించేందుకు ప్రయత్నించారు. రేపల్లె, శ్రీకాళహస్తి, చిలకలూరిపేటలో అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఎవరి ఆస్తులకైనా భద్రత ఉందా? మహిళలకు భద్రత ఉందా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? వీరిని ఇలాగే వదిలేస్తే ఉగ్రవాదులకంటే ఘోరంగా తయారవుతారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు