ఎస్‌ఈసీ రాజీనామా చేయాలి:విజయసాయిరెడ్డి

స్థానిక ఎన్నికల వాయిదాపై అధికారులతో సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ ఎలా నిర్ణయం తీసుకుంటారని...

Published : 16 Mar 2020 00:59 IST

విశాఖ: స్థానిక ఎన్నికల వాయిదాపై అధికారులతో సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ ఎలా నిర్ణయం తీసుకుంటారని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 243కె, 243 జడ్‌ ఏ ఆర్టికల్స్‌ను తుంగలో తొక్కారని.. ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. మునిగిపోతున్న తెదేపా నావను రక్షించాలనే స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎస్‌ఈసీకి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని