నేడు కమల్ సర్కార్కు బలపరీక్ష లేనట్లేనా?
మధ్యప్రదేశ్లో సంక్షోభంలో కూరుకుపోయిన కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ నేడు బలపరీక్ష ఎదుర్కొనే అవకాశాలు కన్పించట్లేదు. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించినప్పటికీ అసెంబ్లీ స్పీకర్ దీనిపై
భోపాల్: మధ్యప్రదేశ్లో సంక్షోభంలో కూరుకుపోయిన కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ నేడు బలపరీక్ష ఎదుర్కొనే అవకాశాలు కన్పించట్లేదు. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించినప్పటికీ అసెంబ్లీ స్పీకర్ దీనిపై ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు సోమవారం శాసనసభ ఎజెండాలో బలపరీక్ష ప్రస్తావన లేకపోవడంతో నేడు కమల్ సర్కార్ విశ్వాస పరీక్షను ఎదుర్కోకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
నేటి నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే నేటి ఎజెండాలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ సంప్రదాయ ప్రసంగంతో పాటు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మాత్రమే ఉన్నాయి. బలపరీక్ష గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అటు స్పీకర్ కూడా దీనిపై సోమవారమే నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో నేడు విశ్వాస పరీక్ష జరిగేలా కన్పించట్లేదు.
బలపరీక్షకు సిద్ధమే..
మరోవైపు అసెంబ్లీ తమ బలాన్ని నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్నాథ్ అన్నారు. నిన్న రాత్రి గవర్న్ లాల్జీ టాండన్ను కలిసిన ఆయన.. స్పీకర్ నిర్ణయిస్తే విశ్వాసపరీక్షకు తాను ఎప్పుడైనా సిద్ధమేనన్నారు.
రాష్ట్రానికి భాజపా 6ఎమ్మెల్యేలు
ఇదిలా ఉండగా.. సంక్షోభం నేపథ్యంలో గత ఐదు రోజులుగా హరియాణాలో ఉన్న భాజపా ఎమ్మెల్యేలు నేడు రాష్ట్రానికి చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున వారంతా భోపాల్ విమానాశ్రయానికి చేరుకోగా.. రాష్ట్ర భాజపా యంత్రాంగం ఎమ్మెల్యేలను హోటల్కు తరలించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా