కేంద్రమంత్రితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. దిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. మూసీ నదిని పరిరక్షించాలని

Published : 16 Mar 2020 20:47 IST

దిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిల్లీలో భేటీ అయ్యారు. మూసీ నదిని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నమామి గంగ తరహాలో కార్యక్రమాలు చేపట్టాలని మంత్రిని కోరారు. కాలుష్య నియంత్రణ కోసం ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, మూసీ నది ఒడ్డున విరివిరిగా చెట్ల పెంపకాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నదిపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని.. పరిశ్రమలు మూసివేసి కాలుష్యాన్ని నివారించాలని కోరారు. మూసీ నదికి పూర్వవైభవం తెస్తే కోట్ల మందికి  ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రికి కోమటిరెడ్డి వివరించారు. ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని