దిల్లీలో తెలంగాణ భాజపా ఎంపీల మౌనదీక్ష

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడంపై భాజపా ఎంపీలు దిల్లీలో నిరసన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ.......

Published : 18 Mar 2020 00:59 IST

దిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడంపై భాజపా ఎంపీలు దిల్లీలో నిరసన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ భాజపా ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌తో పాటు స్థానిక భాజపా నేతలు మౌనదీక్ష చేపట్టారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈ దీక్ష చేపట్టారు. సీఏఏకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సీఏఏ అనేది పౌరసత్వం ఇచ్చేదే తప్ప ఉన్న పౌరసత్వాన్ని తొలగించేది కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సీఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని