జనతా కర్ఫ్యూ:చప్పట్లు కొట్టిన కేసీఆర్,జగన్
కరోనా వైరస్ నిర్మూలనకు దేశవ్యాప్తంగా జాతి యావత్తూ జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమస్ఫూర్తితో
హైదరాబాద్: కరోనా వైరస్ నిర్మూలనకు దేశవ్యాప్తంగా జాతి యావత్తూ జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమస్ఫూర్తితో ఇది కొనసాగుతోంది. కరోనా వైరస్ నియంత్రణకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది నిరాటంగా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ఈ సాయంత్రం 5 గంటలకు దేశ వ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లలోంచి బయటకు వచ్చి సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ గంట కొట్టి మద్దతు ప్రకటించారు. ప్రజలు సైతం ఇళ్ల ముందు నిలుచుని వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు