వైద్యులకు భరోసా కల్పిస్తాం: తలసాని
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని హేయమైన చర్యగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. గురువారం గాంధీ ఆస్పత్రిని ఆయన సందర్శించి అక్కడ కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు...
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని హేయమైన చర్యగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. గురువారం గాంధీ ఆస్పత్రిని ఆయన సందర్శించి అక్కడ కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, దాడి ఘటనకు సంబంధించిన వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యులపై ఎవరైనా దాడికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుత సమయంలో వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు వైద్యం అందిస్తున్నారని.. వైద్యులకు భరోసా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోని యాచకులను వేరే ప్రాంతాలకు తరలించనున్నట్లు చెప్పారు. దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన సమావేశానికి వెళ్లి రాష్ట్రానికి వచ్చిన వారిని దాదాపు గుర్తించామని మంత్రి తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ఆస్పత్రికి వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!