అంత ప్రేమ ఉంటే ఈ ఒక్కపని చేయండి:మోదీ
ప్రజలందరూ ఐదు నిమిషాలు నిలబడి తనకు వందనం చేయాలన్న వార్తలు అవాస్తవమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దురుద్దేశపూర్వకంగానే తనను వివాదంలోకి లాగేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఇది కనిపిస్తోందని పేర్కొన్నారు. కొందరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారేమోనని అన్నారు. ఈ మేరకు ఆయన....
తనకు గౌరవ వందనం చేయాలన్న సందేశ సృష్టికర్తలకు ప్రధాని చురకలు
దిల్లీ: ప్రజలందరూ ఐదు నిమిషాలు నిలబడి తనకు వందనం చేయాలన్న వార్తలు అవాస్తవమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దురుద్దేశపూర్వకంగానే తనను వివాదంలోకి లాగేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఇది కనిపిస్తోందని పేర్కొన్నారు. కొందరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారేమోనని అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్లో హిందీలో వరుస ట్వీట్లు చేశారు.
‘మరోసారి నేను ఉద్ఘాటిస్తున్నాను. మీకు నాపై చెప్పలేనంత ప్రేముంటే, మోదీని గౌరవించాలని భావిస్తే ఒక పేద కుటుంబం బాధ్యతను తీసుకోండి. కనీసం కరోనా వైరస్ ముప్పు తొలిగిపోయేంత వరకైనా వారిని ఆదుకోండి. ఇంతకన్నా ఎక్కువ గౌరవం నాకొద్దు’ అని మోదీ ట్వీట్ చేశారు. తన కోసం ఐదు నిమిషాలు గౌరవ వందనం చేయాలని జరుగుతున్న ప్రచారాన్ని కొందరు తన దృష్టికి తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు.
‘సందేశం చూడగానే మోదీని వివాదంలోకి లాగాలన్న దురుద్దేశం కనిపిస్తోంది’ అని మోదీ రాశారు. జాతి సంక్షేమం కోసం ప్రధాని చేస్తున్న మంచిపని కోసం ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాలు ఆయనకు నిలబడి గౌరవ వందనం చేయాలని సోషల్మీడియాలో ఓ సందేశం వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్