ప్రస్తుతం రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాజకీయాల జోలికి వెళ్లడం లేదని.. సంయమనంతో వ్యవహరిద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో పవన్..
విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాజకీయాల జోలికి వెళ్లడం లేదని.. సంయమనంతో వ్యవహరిద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో పవన్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని వైకాపా నేతలతో పంపిణీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సభ్యులకు పవన్ సూచించారు. కరోనా నియంత్రణలో ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన సూచనలు పాటిస్తూ పేద ప్రజలకు అండగా నిలుద్దామని పవన్ పిలుపునిచ్చారు.
‘‘కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి అయింది. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు పార్టీ పరంగా అన్ని విధాలా సహకరిద్దాం. వారికి ఏ విధంగా సాయం చేయాలనేదానిపై ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్దాం. ఇలాంటి సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సేవలు అందేలా చూడాలి’’ అని పవన్ సభ్యులను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్