రేషన్ కోసం కూపన్లు: మంత్రి కొడాలి
కొన్ని పొరపాట్లను ప్రతిపక్ష పార్టీలు గోరంతను కొండంత చేయడానికి ప్రయత్నించాయి. ఈ సారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అందరికీ కూపన్లు ఇస్తున్నాం. రేషన్ దుకాణాలకు
విజయవాడ: రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిబద్ధతతో పని చేస్తున్నారని మంత్రి కొడాలి నాని కొనియాడారు. హమాలీలు సైతం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమవుతుందన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాసవాన్ రాష్ట్రాలతో మాట్లాడారని నాని తెలిపారు. కేవలం 92 లక్షల కార్డులను మాత్రమే కేంద్రం పరిగణలోనికి తీసుకుంటుందన్నారు. వారికి మాత్రమే కేంద్రం ప్రకటించిన సాయం అందుతుందని.. అయితే రాష్ట్రంలో కోటి 40 లక్షల కార్డులు ఉన్నాయని మంత్రి మీడియాకు వెల్లడించారు.
ధాన్యం కొనుగోలు కోసం ఉంచిన డబ్బులను చంద్రబాబు పసుపు కుంకుమ కోసం వాడేశారని మంత్రి విమర్శించారు. గతంలో రూ.2 వేల కోట్లు, తాజాగా రూ. 2200 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. ‘‘రాష్ట్రంలో గోనె సంచులు అవసరం చాలా ఉంది. 45 వేల బేళ్ల గోనె సంచులు రావాలి. మార్చి 29 నుంచి ఇవాళ్టి వరకు కోటి 35 లక్షల మంది రేషన్ తీసుకున్నారు. రేషన్ పంపిణీలో అందరూ కష్టపడి పనిచేశారు. కొన్ని పొరపాట్లను ప్రతిపక్ష పార్టీలు గోరంతను కొండంత చేయడానికి ప్రయత్నించాయి. ఈసారి ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా అందరికీ కూపన్లు ఇస్తున్నాం. రేషన్ దుకాణాలకు అందరూ కూపన్లు తీసుకునే రావాలి. రద్దీని నియంత్రించడానికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.
కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయని మంత్రి తెలిపారు. కానీ, రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. విపక్షాలకు చెందిన నేతలు ప్రభుత్వం, అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి వైద్య ఆరోగ్య శాఖ కానీ.. సంబంధిత మంత్రి కానీ ఎక్కడైనా విఫలమయ్యారా?అని కొడాలి నాని ప్రశ్నించారు. కరోనాను నియంత్రించడంలో మన రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని.. నిత్యం అధికారులతో సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నారని మంత్రి చెప్పారు.
16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ: కోన శశిధర్
రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇప్పటికే తొలి విడత రేషన్, కందిపప్పు అందజేసినట్లు పౌరసరఫరాల కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. ఈ నెల 16 నుంచి రెండో విడత పంపిణీ చేపడతామన్నారు. రబి పంట సేకరణ కూడా ప్రారంభమైందని, దీనికోసం 993 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రతి గ్రామ సచివాలయంలో రైతుల పేర్ల నమోదు ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. ‘‘ పక్క రాష్ట్రాల్లో పండించిన పంట ఇక్కడికి రాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా ఉంచుతున్నాం. అక్కడ తక్కువకు కొని ఇక్కడ మిల్లర్లు ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉంది. పౌరసరఫరాల శాఖ అంటే చౌక ధరల దుకాణాలు మాత్రమే కాదు. ఎల్పీజీ, పెట్రోల్ బంకుల ఔట్ లెట్లు కూడా పౌరసరఫరాల పరిధిలోకే వస్తాయి. లబ్ధిదారులకు ముందుగానే కూపన్లు ఇచ్చి రేషన్ అందిస్తాం. కార్డుదారులెవరూ తొందర పడొద్దు. సరిపడా సరుకులు అందుబాటులోనే ఉన్నాయి. ఈ-క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నాం. గ్రామ సచివాలయంలో రైతులు, కౌలు రైతుల వివరాలు ఉంచుతాం. మద్దతు ధర కంటే తక్కువకు రైతులు పంటను అమ్ముకోవాల్సిన పని లేదు. ఇంత ఇబ్బందుల్లోనూ అన్ని చౌకధరల దుకాణాలకు సరుకులు అందజేశాం. 16 నుంచి కుటుంబానికి కేజీ శనగలు పంపిణీ చేస్తాం. రేషన్ దుకాణాల సమయాలు ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయిస్తారు. లబ్ధిదారులు ఎలాంటి సమస్య ఉన్నా టోల్ఫ్రీ నెంబర్ 1902కి ఫోన్ చేసి చెప్పవచ్చు. పాత కార్డులు ఉన్న వారందరికీ రేషన్ ఇస్తాం. బతుకు తెరువు కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు పోర్టబిలిటీ కింద రేషన్ తీసుకోవచ్చు. మార్చి 29 నుంచి 30 లక్షలకు పైగా పోర్టబిలిటీ కింద రేషన్ తీసుకున్నారు’’ అని కమిషనర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు