వైద్య కళాశాలల కోసం స్థలాలు ఎంపిక చేయండి

రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశించారు. నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్‌ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని అన్నారు.

Published : 19 Apr 2020 00:35 IST

 సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశించారు. నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్‌ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ‘నాడు- నేడు’ కార్యక్రమాలపై సీఎం జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపైనా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యరంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాలకు రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ‘‘ మనం చేపట్టే పనులు ఇప్పటివారికే కాదు, భవిష్యత్‌ తరాలకూ సంబంధించినవి.వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి’’ అని సీఎం అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని