వైద్య కళాశాలల కోసం స్థలాలు ఎంపిక చేయండి
రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఆదేశించారు. నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని అన్నారు.
సీఎం జగన్ ఆదేశం
అమరావతి: రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఆదేశించారు. నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ‘నాడు- నేడు’ కార్యక్రమాలపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపైనా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యరంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాలకు రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ‘‘ మనం చేపట్టే పనులు ఇప్పటివారికే కాదు, భవిష్యత్ తరాలకూ సంబంధించినవి.వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి’’ అని సీఎం అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!