ఒక్కో కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలి: ఉత్తమ్
తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి విపత్తు వేళ రూ.5వేల చొప్పున సాయం అందించాలని విపక్షనేతలు డిమాండ్ చేశారు...
హైదరాబాద్: తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి విపత్తు వేళ రూ.5వేల చొప్పున సాయం అందించాలని విపక్షనేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్ను కలిసి కరోనా సహాయక చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం ఆదుకోవాలని సీఎస్కు సూచించారు.
సీఎస్ సమావేశం అనంతరం విపక్ష నేతలు మాట్లాడుతూ.. ‘‘ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలంటే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. కరోనా కట్టడికి అందరినీ కలుపుకొనిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అన్ని ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలకు అవకాశం కల్పించాలి. 104, 108 సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించాలి. కరోనా నివారణకు పీహెచ్సీ సిబ్బంది సేవలు వాడుకోవాలి. వైద్య సౌకర్యాల కల్పనకు మినరల్ ఫండ్ను వినియోగించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని విపక్ష నేతలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు