వలస కార్మికులకే తొలి ప్రాధాన్యం: ఆళ్ల నాని
ఏపీకి చెందిన 2లక్షల మంది కార్మికులు 14 రాష్ట్రాల్లో ఉన్నారని.. ఇతర రాష్ట్రాలకు చెందిన 12,794 మంది ఏపీలో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీకి తరలించే విషయంలో వలస కార్మికులకే
విజయవాడ: ఏపీకి చెందిన 2లక్షల మంది కార్మికులు 14 రాష్ట్రాల్లో ఉన్నారని.. ఇతర రాష్ట్రాలకు చెందిన 12,794 మంది ఏపీలో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీకి తరలించే విషయంలో వలస కార్మికులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. విజయవాడలో రాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో దశలో విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులను తరలిస్తామని ఆళ్ల నాని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి 9 రైళ్ల ద్వారా రాష్ట్రానికి చెందిన కూలీలను తీసుకొస్తామని వివరించారు. గ్రామ సచివాలయంలో ఒకటి చొప్పున లక్ష పడకలతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చేలోపు క్వారంటైన్లను సిద్ధం చేస్తామని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నచోట 500 బస్సుల ద్వారా నిత్యావసరాలను విక్రయిస్తామన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల ఇంటికి ఒకరికి చొప్పున పాస్ ఇస్తామని ఆళ్ల నాని స్పష్టం చేశారు.
‘స్పందన’ వెబ్సైట్లో నమోదు చేయండి: కృష్ణబాబు
రాబోయే రోజుల్లో కరోనా నిబంధనలు మరింత సడలించే అవకాశాలున్నాయని కొవిడ్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. వలస కార్మికులు spandana.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి రావాలనుకునే వలసకూలీలు వెబ్సైట్, మెయిల్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ప్రాంతం, వెళ్లాలనుకునే ప్రాంతం వెబ్సైట్లో స్పష్టంగా తెలియజేయాలని కృష్ణబాబు సూచించారు. శ్రామిక్ రైళ్లలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన జాబితా ప్రకారమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ నుంచి మహారాష్ట్రలోని బలార్షకు రెండు శ్రామిక్ రైళ్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి వచ్చేవారు కూడా ఒక క్రమపద్ధతిలో రాకపోతే వారికి సదుపాయాలు చేయడం కష్టమవుతుందని కృష్ణబాబు వివరించారు.
ఇదీ చదవండి..
శ్రామిక్ రైళ్లకు 90 శాతం ఆక్యుపెన్సీ ఉండాల్సిందే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!