సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలు కాకుండా చూడాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తక్షణమే పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేసేలా చర్యలు

Published : 13 May 2020 15:13 IST

హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలు కాకుండా చూడాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తక్షణమే పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా బేసిన్‌లోని రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని లేఖలో కోరారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగేలా ఏదైనా జరిగితే పోతిరెడ్డిపాడు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని.. చలో పోతిరెడ్డిపాడు ద్వారా సీఎం విధానాలను ఎండగడతామని కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని