మండలి సభ్యుడిగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణం!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే శాసనమండలి సభ్యుడిగా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఠాక్రేతో పాటు మరో ఎనిమిది మంది కూడా మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Published : 19 May 2020 03:39 IST

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే శాసనమండలి సభ్యుడిగా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఠాక్రేతో పాటు మరో ఎనిమిది మంది కూడా మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రితోపాటు నూతనంగా ఎన్నికైన సభ్యులను గవర్నర్‌ అభినందించారు. ఖాళీగా ఉన్న తొమ్మిది స్థానాలకు కేవలం తొమ్మిది మందే నామినేషన్లు వేయడంతో ఫలితం ఏకగ్రీవమైంది. తొమ్మిదిమందిలో శివసేన నుంచి ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు మరోసభ్యుడు ఉండగా.. బీజేపీ నుంచి నలుగురు, ఎన్సీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో ఏర్పడ్డ ‘మహా వికాస్‌ అఘాడీ’ కూటమిలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని