సోనియా నేతృత్వంలో ప్రతిపక్షాల సమావేశం
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోనియా గాంధీ నేతృత్వంలో శుక్రవారం ప్రతిపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ సమావేశంలో ప్రధానంగా భాజపా ప్రభుత్వం.....
దిల్లీ: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వెల్లడించింది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వలస కార్మికులు ఎదురుర్కొంటున్న సమస్యలు, కార్మిక చట్టాల్లో రాష్ట్రాలు చేస్తున్న మార్పులు, ఇటీవల కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజిపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి దేశంలోని 18 పార్టీలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. డీఎంకే నేత స్టాలిన్, వామపక్ష పార్టీలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించినట్లు కాంగ్రెస్ వెల్లడించింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు వాయిదా పడటంతో కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇదే తరహాలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశాలను కూడా నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, ఆనంద్ శర్మ సంబంధిత అధికారులను కోరారు. మార్చి నెలలో వైరస్ తీవ్రతను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. అయితే కొద్ది వారాలుగా పలు రాష్ట్రాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తుడటం, కేంద్రం ఆర్థిక ప్యాకేజిని ఆలస్యంగా ప్రకటించడంతో ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో దేశం నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన