మేఘాలయ ముఖ్యమంత్రి టాలెంట్ చూశారా?
రాజకీయవేత్తగా ప్రజాదరణ పొందిన మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా, ఈసారి తన గిటార్ నైపుణ్యంతో ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజకీయవేత్తగా ప్రజాదరణ పొందిన మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా, ఈసారి తన గిటార్ నైపుణ్యంతో ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. బ్రిటన్ పాశ్చాత్య సంగీత బృందం ఐరన్ మెయిడెన్కు చెందిన ‘వేస్టెడ్ ఇయర్స్’ ఆల్బంలోని గీతాన్ని ఆయన తన గిటార్పై వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సంగ్మా ఇన్స్టాగ్రామ్లో షేర్చేశారు. ‘‘మూడు రోజుల బిజీ బిజీ అసెంబ్లీ సమావేశాల అనంతరం... ఐరన్ మెయిడన్ గీతాలతో సేద తీరుతున్నాను. గిటార్ వాయించి చాలా కాలమైంది... కొన్ని తప్పులు ఉండచ్చేమో...’’ అంటూ వ్యాఖ్యానాన్ని జోడించారు.
42 సంవత్సరాల కొన్రాడ్ సంగ్మా లోక్సభ మాజీ స్పీకర్ దివంగత పీఏ సంగ్మా కుమారుడు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా (అమెరికా), ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్లలో ఉన్నత విద్యను అభ్యసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలను నిర్వహించటమే కాకుండా, మేఘాలయ క్రికెట్ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ అకాడమీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కొద్ది గంటల క్రితం సంగ్మా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే సుమారు నలభై ఐదు వేలకు మంది చూశారు. అంతేకాకుండా, సంగ్మా లెజెండ్ అని, ఆయన పాట వినడానికి చాలా హాయిగా ఉందని, దేశంలోని ముఖ్యమంత్రులలో ఆయనే మోస్ట్ టాలెంటెడ్ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని గీతాలు వినిపించాలంటూ పలువురు ఆయనను కోరటం విశేషం. పాశ్చాత్య సంగీతంతో పరిచయం లేనివారు కూడా ఇష్టపడేంత మధురంగా ఉన్న ఈ వీడియోను మీరూ చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్