తెదేపా ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై విచారణ

పార్టీ విప్‌ ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెదేపా ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతల అనర్హత పిటిషన్‌పై శాసనమండలిలో విచారణ జరిగింది. ఈ మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదుపై మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ విచారణ చేపట్టారు. జనవరిలో జరిగిన..

Updated : 04 Jun 2020 11:09 IST

అమరావతి: పార్టీ విప్‌ ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెదేపా ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతల అనర్హత పిటిషన్‌పై శాసనమండలిలో విచారణ జరిగింది. ఈ మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదుపై మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ విచారణ చేపట్టారు. జనవరిలో జరిగిన శాసనమండలి సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు సంబంధించి తెదేపా అధిష్ఠానం ఎమ్మెల్సీలు అందరికీ విప్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై జరిగిన ఓటింగ్‌లో ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతలు పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా వ్యవహరించారని తెదేపా ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్‌బాబు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలన్న ఛైర్మన్‌ ఆదేశాల మేరకు బుద్ధా వెంకన్న, అశోక్‌బాబు తమ వాదనలు వినిపించారు. కొన్ని కారణాల రీత్యా విచారణకు హాజరు కాలేకపోతున్నామని పోతుల సునీత, శివనాథ రెడ్డిలు ఛైర్మన్‌కు తెలియజేశారు. అయితే ఇద్దరు ఎమ్మెల్సీలు సాకులు చెప్పి విచారణకు హాజరుకాలేదని.. వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని బుద్ధావెంకన్న మండలి ఛైర్మన్‌ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని