ప్రతిపక్షాలపై అక్రమ కేసులా?: నిమ్మల
ఎల్జీపాలిమర్స్ ఘటనలో బాధితుల తరఫున పోరాడిన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
ఏలూరు: ఎల్జీపాలిమర్స్ ఘటనలో బాధితుల తరఫున పోరాడిన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ పాలీమర్స్ బాధితుల పరిహారంపై ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. ఇళ్ల స్థలాల ముసుగులో వైకాపా నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైకాపా భూ కుంభకోణాలను అసెంబ్లీ, శాసనమండలి వేదికగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో ఆవ భూముల పేరుతో రూ.400 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఓవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే .. మరో వైపు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయికూడా పేదలపై భారం మోపమని చెప్పిన జగన్ మోహన్రెడ్డి రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో విద్యుత్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలని రామానాయుడు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM