‘జగనన్న చేదోడు’ మరో జగన్మాయ: చంద్రబాబు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ మరో జగన్మాయ పథకమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అబద్ధమే వైకాపా ఆయుధమని వ్యాఖ్యానించారు. గతంలో అందరికీ లబ్ధి చేస్తామని చెప్పి..
విజయవాడ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ మరో జగన్మాయ పథకమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అబద్ధమే వైకాపా ఆయుధమని వ్యాఖ్యానించారు. గతంలో అందరికీ లబ్ధి చేస్తామని చెప్పి.. ఇప్పుడు షాపులు ఉన్నవాళ్లకే పథకం వర్తిస్తుందని మాట మార్చారని దుయ్యబట్టారు. బుధవారం పార్టీ ముఖ్యనాయకులతో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..
‘‘జగనన్న చేదోడు’ పేరుతో భారీగా కోతలు పెట్టారు. రాష్ట్రంలో 5.50లక్షలకు పైగా నాయి బ్రాహ్మణులుంటే 38వేల మందికే ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తున్నారు. పథకం ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే రూ.10వేలకంటే రెట్టింపు వారినుంచి లాక్కుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 13లక్షల మంది టైలర్లు ఉంటే 1.25లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. రజకులు 15లక్షల మంది ఉంటే 82వేల మందికే ఈ పథకం వర్తిస్తోంది’ అని చంద్రబాబు మండిపడ్డారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుడు వార్తలతో ప్రజలను నమ్మించారని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక అసత్యాలతో నయ వంచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులు, ప్రలోభాలతో కొందరిని వైకాపా లోబర్చుకుంటోందని ఆక్షేపించారు. వేధింపులకు భయపడే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారన్నారు. వారు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదని.. ఒకరుపోతే వంద మంది నాయకులను తయారు చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘రాజకీయ విశ్వవిద్యాలయం’ తెలుగుదేశమని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా నాయకులను తయారుచేసే కార్ఖానా అని.. మళ్లీ సమర్థ నాయకత్వాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు. రాబోయే 40ఏళ్లకు దీటుగా నాయకత్వాన్ని తయారు చేస్తామని చెప్పారు. దానికి తగ్గ ఓపిక, బాధ్యత తనకు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయమెందుకు?
ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
నామినేషన్లకు వేళాయె..
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
అడ్డంకులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్రాజ్ ఆదేశించారు. -
కాంగ్రెస్లో వలసల ప్రభావమెంత?
కాంగ్రెస్లోకి కొనసాగుతున్న భారీ వలసలు లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. -
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!