నితీశ్ ధ్యాస ఎన్నికలపైనే..
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. దేశమంతా కరోనా సంక్షోభాన్ని ఎలా అధిగమించాలని అన్వేషిస్తుంటే నితీశ్ ఎన్నికల గురించి చర్చిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ‘అతి తక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నప్పటికీ 7-9 శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 6వేల కేసులున్నాయి.
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. దేశమంతా కరోనా సంక్షోభాన్ని ఎలా అధిగమించాలని అన్వేషిస్తుంటే నితీశ్ ఎన్నికల గురించి చర్చిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ‘అతి తక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నప్పటికీ 7-9 శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 6వేల కేసులున్నాయి. బిహార్లో కరోనా వైరస్ కంటే ఎన్నికలే ముఖ్యమైన అంశంలా ఉంది. కొవిడ్ భయంతో బయట అడుగు పెట్టని నితీశ్కుమార్ ఓటు వేయడానికి బయటకొస్తే మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తున్నారని’ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. వివిధ అంశాలపై నితీశ్కుమార్ను లక్ష్యంగా చేసుకుని ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కొవిడ్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటీవల కేంద్రం నుంచి 1.25లక్షల కోట్ల సహాయాన్ని రాష్ట్రం పొందిందనే విషయాన్ని బిహార్ ప్రజలకు బహిరంగంగా చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను ఈ ఏడాది జనవరిలో జేడీయూ బహిష్కరించిన విషయం తెలిసిందే.
అయితే ముఖ్యమంత్రి నితీశ్ ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. తొలుత నుంచి నితీశ్ సారథ్యంలోని జేడీయూ 90:10 సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. 90శాతం సమయాన్ని అభివృద్ధి, సంక్షేమం రూపంలో ప్రజలకు చేరువ కావడం, 10శాతం శాతం సమయాన్ని ప్రతిపక్షాలు చేసే అర్థంలేని విమర్శలను కొట్టిపారేయడం కోసం కేటాయించడమే దీని ముఖ్య ఉద్దేశం. ‘రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ప్రజలు ఆమోద ముద్ర వేయడమే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కారణం. ఇప్పుడు మూడో విజయం సాధించడంలో కూడా ఎలాంటి మార్పు లేదని’ కార్యకర్తలతో వర్చువల్ సమావేశాల్లో మాట్లాడుతూ నితీశ్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!