ఏపీ అసెంబ్లీలో 8 బిల్లులు: శ్రీకాంత్‌రెడ్డి

ఏపీ శాసనసభలో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో

Published : 16 Jun 2020 11:34 IST

అమరావతి: ఏపీ శాసనసభలో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ...సీఆర్డీఏ బిల్లు కూడా సభలో పెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని తెదేపా నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. తెదేపా సభ్యులు నల్లచొక్కాలతో సభకు రావడం కొత్త డ్రామా అని విమర్శించారు. రూ.150కోట్ల అవినీతిలో అచ్చెన్న పాత్ర ఉందని విచారణలో తేలిందని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని