అరెస్టులపై ఎన్హెచ్ఆర్సీకి తెదేపా ఫిర్యాదు
అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై తెలుగుదేశం నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు
అమరావతి: అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై తెలుగుదేశం నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టు తీరుపై టీడీఎల్పీ ఉప నేత రామానాయుడు, జేసీ కుటుంబ సభ్యుల అరెస్టులపై ఎమ్మెల్సీ గౌరవాణి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.
వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షన్ వాదాన్ని సాగిస్తోందని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతీకార చర్యలతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని వారు ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం నేతలు, క్యాడర్పై హింస కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టు విషయంలో వైకాపా ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ అధికారులు వ్యవహరించారని ఆక్షేపించారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదన్న తెదేపానేతలు.. శస్త్రచికిత్స గాయంతో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి దాదాపు 600 కిలోమీటర్ల రోడ్డు మార్గం ద్వారా ప్రయాణింపజేశారని మండిపడ్డారు. అరెస్టు అమానుషమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని వారు ఆరోపించారు. వైకాపా వ్యూహాలను అనుసరిస్తూ ప్రతిపక్షాలపై కక్షసాధిస్తోందని విమర్శించారు. తమ ఒత్తిళ్లకు లొంగని పార్టీ నేతలను ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా నేతలు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM