రమేశ్‌ కుమార్‌ను అడ్డుకుంటున్నారు: కన్నా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌

Published : 18 Jun 2020 01:03 IST

గుంటూరు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇది.. రాజ్యాంగ బద్ధ సంస్థలను అగౌరవపరచడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. రమేశ్‌ కుమార్‌ విజయవాడ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రమేశ్‌ కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగేలా చూడాలని, రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని