జగన్‌ కక్ష సాధింపులకు తలొగ్గను: జేసీ

ముఖ్యమంత్రి జగన్‌ కక్షసాధింపు చర్యలకు తలొగ్గేదిలేదని తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఎన్నో రోజులు...

Updated : 18 Jun 2020 12:21 IST

అనంతపురం: ముఖ్యమంత్రి జగన్‌ కక్ష సాధింపు చర్యలకు తలొగ్గేది లేదని తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఎన్నో రోజులు పాలించటం సాధ్యం కాదన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో నా బస్సులు, లారీలను నిలిపివేశారు. అయినా నాకు పొలం ఉంది. దాన్ని సాగు చేసుకుంటూ బతకగలను. అంతేగానీ వైకాపా బెదిరింపులకు లొంగేది లేదు. వచ్చే ఏడాది బడ్జెట్‌ తర్వాత నవరత్నాలు అమలును కొనసాగించలేరు. కొనసాగించాలంటే రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మక తప్పదు. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఏవీ జగన్‌ చేపట్టడం లేదు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు’’ అని జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు