జగన్ కక్ష సాధింపులకు తలొగ్గను: జేసీ
ముఖ్యమంత్రి జగన్ కక్షసాధింపు చర్యలకు తలొగ్గేదిలేదని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఎన్నో రోజులు...
అనంతపురం: ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలకు తలొగ్గేది లేదని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఎన్నో రోజులు పాలించటం సాధ్యం కాదన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో నా బస్సులు, లారీలను నిలిపివేశారు. అయినా నాకు పొలం ఉంది. దాన్ని సాగు చేసుకుంటూ బతకగలను. అంతేగానీ వైకాపా బెదిరింపులకు లొంగేది లేదు. వచ్చే ఏడాది బడ్జెట్ తర్వాత నవరత్నాలు అమలును కొనసాగించలేరు. కొనసాగించాలంటే రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మక తప్పదు. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఏవీ జగన్ చేపట్టడం లేదు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు’’ అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్