రాహుల్.. చిల్లర రాజకీయాలొద్దు: అమిత్ షా
భారత్ - చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దిల్లీ: భారత్ - చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో చిల్లర రాజకీయాలను విడనాడి దేశం తరఫున నిలబడాలని సూచించారు. గల్వాన్ ఘటనలో గాయపడిన ఓ సైనికుడి తండ్రి వ్యాఖ్యలతో ఉన్న వీడియోను అమిత్ షా ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘మన సైన్యం చాలా బలమైనది. చైనాను ఓడించగలదు. రాహుల్ గాంధీ ఈ విషయంలో రాజకీయాలు చేయకండి. నా కుమారుడు సైన్యంలో ఉండి పోరాడాడు. తన పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తాడు’’ అని ఆ జవాన్ తండ్రి వ్యాఖ్యలు చేశారు.
‘‘ ఓ వీర సైనికుడి తండ్రి రాహుల్కు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు. దేశమంతా ఏకతాటిపై నిలిచిన ప్రస్తుత తరుణంలో రాహుల్ చిల్లర రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా సంఘీభావంతో మెలగాలి’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
చైనా-భారత్ హద్దులోని గల్వాన్ లోయలో చైనా దురాగతానికి మన సైనికులు 20 మంది బలైన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దులో చోటుచేసుకున్న పరిణామలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి సంఘీభావం తెలిపాయి. భారత భూభాగంలోకి చైనా చొరబడలేదనీ.. కన్నెత్తి చూసేందుకు ప్రయత్నించిన వారికి మన సైనికులు గుణపాఠం నేర్పారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ చైనా దురాక్రమణకు తలొగ్గి ప్రధాని భారత భూభాగాన్నివారికి అప్పగించారంటూ తీవ్రస్థాయిలో ట్విటర్లో వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య