ఇది ఆరోపణల సమయం కాదు: ఈటల

తెలంగాణ ప్రభుత్వంపై భాజపా నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

Published : 22 Jun 2020 02:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంపై భాజపా నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. జన సంవాద్‌ సభ(వర్చువల్‌ ర్యాలీ)లో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘ఇది పరస్పర ఆరోపణలు చేసుకునే సమయం కాదు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపణలు సరికావు. జాతీయస్థాయి నాయకుడు అయిన ఆయన ఒక గల్లీ లీడర్‌ మాట్లాడినట్లు మాట్లాడారు. కరోనా అనేది ప్రపంచ సమస్య. గుజరాత్‌లో కరోనా తీవ్రతపై ప్రధాని బాధ్యత వహిస్తారా? తెలంగాణలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. సీఎం కేసీఆర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కరోనాపై అన్ని రాష్ట్రాల కన్నా ముందే అప్రమత్తమయ్యాం. లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేశాం. తెలంగాణ ప్రభుత్వం చర్యలపై కేంద్ర బృందాలు హర్షం వ్యక్తం చేశాయి’’ అని ఈటల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని