కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించండి

ఆయన ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే...

Updated : 21 Jun 2020 20:49 IST

ఎంపీ రఘు రామకృష్ణ రాజు లేఖ

దిల్లీ: తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు లేఖ రాశారు. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని ఎంపీ లేఖలో కోరారు. ఆయన ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే... 

శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలవడానికి ప్రయత్నించాను. అప్పట్నుంచి నా నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశాను. స్వామి వారి భక్తుడిగా తన లాంటివారు కోరుకున్న విషయాలను మీడియా ద్వారా చెప్పానంతే. ఇలా బహిరంగంగా చెప్పినందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. ఇసుక వ్యవహారంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాను. సామాన్యులకు న్యాయం చేయాలని కోరితే ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారు. నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని బెదిరిస్తున్నారు. స్థానిక పోలీసులకు నా వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు చేసినా... పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు

- స్పీకర్‌కు పంపిన లేఖలో ఎంపీ రఘు రామకృష్ణ రాజు

 

ప్రధాని, హోం మంత్రికీ లేఖలు

లోక్​సభ స్పీకర్​తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు కూడా ఎంపీ రఘు రామకృష్ణ రాజు లేఖలు రాశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తనకు భద్రత కల్పించాలని లేఖలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని