ఒక చిత్రం, ఒక ప్రశ్న: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవలి ఇండో-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
చైనా ఆక్రమణ జరిగిందా? అంటూ సూటి ప్రశ్న
దిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల లద్దాఖ్ వద్ద చోటుచేసుకున్న ఇండో-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ చిత్రాన్ని సామాజిక మాధ్యమ ఖాతాలో ఉంచారు. తన తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తీసిన నాటి అందమైన ‘ప్యాంగాంగ్ సో’ సరస్సు చిత్రాన్ని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా... ‘‘చైనా ఆక్రమణకు వ్యతిరేకంగా మనందరం ఏకమయ్యాము. చైనా మన భూమిని ఆక్రమించిందా?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
మే 5 నుంచి లద్దాఖ్ సమీపంలో భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన ‘ప్యాంగాంగ్ సో’ వద్దనే భారత్తో చైనా ఘర్షణలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అనంతరం అవి జూన్ 15న తీవ్రరూపం దాల్చటంతో గల్వాన్ లోయ వద్ద 20 మంది భారత సైనికులు, సుమారు 40 మందికి పైగా చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా, వాస్తవాధీన రేఖ వద్ద హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న ఇంత ఉద్రిక్త పరిస్థితిలో కూడా... భారత ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు చైనా ప్రశంసిస్తోంది? అని రాహుల్ గాంధీ గతంలో సందేహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ ‘‘సరెండర్ మోదీ’’ అని ఆయన ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో