శాసనసభ నిర్ణయాలే ఫైనల్: తమ్మినేని
శాసనసభ అనేది ప్రజల సభ.. శాసనమండలి కేవలం సలహాలు ఇవ్వడానికి మాత్రమే అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
అమరావతి: శాసనసభ అనేది ప్రజల సభ.. శాసనమండలి కేవలం సలహాలు ఇవ్వడానికి మాత్రమే అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు నిలిచిపోయిన నేపథ్యంలో స్పీకర్ మాట్లాడారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అని తమ్మినేని మరోసారి స్పష్టం చేశారు.
‘‘శాసనసభలో చర్చించి, ఆమోదించిన బిల్లులను ఎగువసభకు పంపించాం. వాటిపై సూచనలు చేసే అవసరం ఉంటే శాసనసభకు సూచించొచ్చు. కానీ ఏకంగా బిల్లును వీటో చేసే అధికారం మండలికి లేదు. ఇచ్చిన గౌరవాన్ని పెద్దల సభ నిలబెట్టుకోలేకపోతోంది. ఇప్పటికైనా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం’’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె